కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని స్కందానగర్ లో బైబిలు మిషను మహిమ దేవాలయ సంఘం 27వ వార్షికోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు మన్నె రాజు, పందిరి యాదగిరి, రెహ్మాన్, పాస్టర్ తిమోతి రాజు తదితరులు పాల్గొన్నారు.