తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలని సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తున్నారని చెప్పారు.
ఈ ఇండ్లలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని మురళీధర్బాగ్లో రూ.10 కోట్లతో నిర్మించిన 120 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ.. రూ.2 వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ఆడబిడ్డ పెండ్లికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్నదని పేర్కొన్నారు. పేదల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టారని చెప్పారు.