సినీ నటుడు, శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ తిరుపతిలో విద్యార్థులతో కలిసి అయన ధర్నాకు దిగారు. చంద్రబాబు అంటే నాకిష్టమే. కానీ ఆయన నాటకాలు మాత్రం నాకిష్టం లేదు. సినిమాల్లో నటిస్తే డబ్బులు ఇస్తారు. అయితే చంద్రబాబు బయట బ్రహ్మాండంగా నటిస్తారు. ప్రజలు అమాయకులు కాబట్టి ఆయనను నమ్మి, ఓట్లు వేసి గెలిపించారు. చివరకు చంద్రబాబు ఏం చేశారు. అందర్నీ మోసం చేశారు.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని లేఖ రాస్తే అంత పొగరా?, అహంకారామా?. పగలు, రాత్రిలా ….అమావాస్య, పౌర్ణమి ఎలా వస్తుందో… అలాగే చంద్రబాబు కాలం ఎల్లవేళలా మనది కాదు అది గుర్తు పెట్టుకో అంటూ ఘాటు విమర్శలు చేశారు.
