తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట కోమటి చెరువు-మినీ ట్యాంకు బండ్ పై మంగళవారం మంత్రి హరీశ్ రావు మార్నింగ్ వాక్ చేశారు. మంత్రి మానస పుత్రిక అయిన సిద్ధిపేట కోమటి చెరువు సుందరీకరణ పనులపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సమీక్షించారు. పట్టణ ప్రజలకు అబ్బురపరిచేవిధంగా ఆట విడుపు కేంద్రంగా మారిందని, పలుచోట్ల ఇంకా మిగులు పనులు తొందరగా దగ్గరుండి చేయించాలని మున్సిపల్ ఛైర్మన్ రాజనర్సుకు సూచించారు. అక్కడి క్షేత్రస్థాయి పెండింగ్లో ఉన్న పనులపై అధికారులతో సమీక్షిస్తూ.. ప్రజా ప్రతినిధులను ఆరా తీస్తూ.. పనులలో ఆలస్యం ఏందుకు చేస్తున్నారని., అధికారులు, ప్రజా ప్రతినిధుల పనితీరుపై ప్రశ్నిస్తూ వెంట బడి పని చేయించాలని సూచించారు. ఇరిగేషన్, మున్సిపల్, టూరిజం శాఖ సమన్వయంతో వెంటనే పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.అనంతరం దేశానికే ఆదర్శప్రాయమైన మిషన్ భగీరథ పైలాన్ ను సిద్ధిపేటకు ఐకాన్ గా తీర్చిదిద్దుతూ నిర్మితమవుతున్న మిషన్ భగీరథ పైలాన్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్ డబ్ల్యూఎస్ సీఈ విజయ్ ప్రకాశ్ తో ఫోన్ లైనులో మాట్లాడి.. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
