శాస్త్ర సాంకేతికతను సమాజ హితానికి ఉపయోగించాలే తప్ప వినాశనానికి కాదని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. పాశ్చాత్య కల్చర్ మోజులో పడి మన సంస్కృతి సంప్రదాయాలను మరచిపోవద్దని సూచించారు. హైదరాబాద్ మాదాపూర్ లో సన్ మీడియా గ్రూపు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియన్ లీడర్ షిప్ అవార్డ్స్ -2019 కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు. హాస్పిటల్స్, స్పోర్ట్స్, బిజినెస్, రియల్ ఎస్టేట్ తదితర విభాగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి అవార్డులు అందజేశారు.