యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయ నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి కానున్నాయి. కొత్త హంగులతో ఆలయం భక్తులకు దర్శనమివ్వనుంది. ఈ క్రమంలో ఆలయ పునర్నిర్మాణ పనులపై మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం సీఎం కేసీఆర్ మరో గొప్పతనం అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఆలయ పునర్నిర్మాణం మొత్తం రాతితోనే జరిగిందన్న ఆయన… రెండున్నర లక్షల టన్నుల గ్రానైట్ ను ఉపయోగించినట్లు తెలిపారు. యాదాద్రి ఆలయం మొత్తం గ్రానైట్తో కట్టిన కట్టడంగా దేశంలో అతి పెద్ద టెంపుల్గా నిలిచిపోతుందన్నారు. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం.. ప్రాచీన కట్టడం మాదిరి ఆలయ పునర్నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే 2000 సంవత్సరాల వరకు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. భారత్ కు ఇది ఒక గొప్ప అద్భుత కట్టడంగా నిలుస్తుందని ట్వీట్ చేసిన వీడియోలో కేటీఆర్ పేర్కొన్నారు.
Renovated #Yadadri Lakshmi Narsimhaswamy Temple; yet another great initiative of Hon’ble CM #KCR Garu ?#Telangana pic.twitter.com/TqI4h3o3gS
— KTR (@KTRTRS) December 9, 2019