ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ సవరణ బిల్లుకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు లోక్ సభలో ఎంపీ నామా నాగేశ్వర్ రావు ప్రకటించారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్టీలకు రిజర్వేషన్లు పెంపుపై.. అసెంబ్లీలో గతంలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. రిజర్వేషన్ల పెంపుపై ప్రధానికి సీఎం కేసీఆర్ పలుమార్లు లేఖ రాశారని నామా గుర్తు చేశారు.ఈ రెండు అంశాలపై కేంద్రం ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. ఆర్టికల్ 334లో పేర్కొన్న ఆంగ్లో ఇండియన్లపై కేంద్రం వివరణ ఇవ్వాలన్నారు.