తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు ఈ రోజు సిద్దిపేట జిల్లాలో అర్భన్ మండలం నాగులబండ లో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హారీష్ రావు మాట్లాడుతూ” తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్దిపేటలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఇందుకు జీఎన్ రావు, పార్థసారథికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ఇంత మంచి కంటి ఆస్పత్రిని అందరూ వినియోగించుకోవాలని కోరారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో కంటి సమస్యలు లేకుండా చేయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు.ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి చైర్మన్ జీఎన్రావు, హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి, ఎమ్మెల్సీ రఘోత్తమ్రెడ్డి, జెడ్పీచైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ పాల్గొన్నారు.
