వారసత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి, ఇప్పుడు కారుణ్య నియామకాల పేరుతో సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికులను మరోసారి మోసం చేస్తున్నాడని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. టీఆఎర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ను గెలిపించేందుకు సీఎం కేసీఆర్ మాయమాటలు చెబతున్నారని భట్టి అన్నారు.గాంధీ భవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన టీఆర్ఎస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం చేసినా చట్టబద్ధంగా చేయాలని , కానీ కేసీఆర్ మాత్రం మాయమాటలతో కార్మికులను వంచిస్తున్నారని భట్టి అన్నారు. వారసత్వ ఉద్యోగాలకు, కారుణ్య నియామకాలకు ఎంతో తేడా ఉందని అని చెప్పిన భట్టి వారసత్వ ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం ప్రతిపక్షాలపై బురద జల్లుతుందని ఆరోపించారు. టీబీజీకేఎస్ తరపున గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్ధానాల్లో ఒక్కటీ నెరవేర్చలేదని , ఈ విషయాన్ని గుర్తుంచుకుని కార్మికులు అంతా కాంగ్రెస్ బలపరుస్తున్న సంఘాలకు చెందిన స్టార్ గుర్తుకు ఓటేయాలని మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
