రాష్ట్ర౦లో పాస్ పోర్టు కోసం ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు పాస్ పోర్టు మేళాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లోని ప్రజలకు అక్కడే సెంటర్లను ఏర్పాటు చేసి పాస్ పోర్టులను ఇస్తున్నారు. ఇందులో భాగంగా రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, సిద్దిపేట, కామారెడ్డి జిల్లా ప్రజల కోసం బుధవారం (అక్టోబర్-25), గురువారాల్లో(అక్టోబర్-26) ప్రత్యేక పాస్పోర్టు సేవల శిబిరాన్ని నిర్వహించనున్నారు. సిరిసిల్లలోని పొదుపు భవన్లో ఈ శిబిరాన్ని నిర్వహించనున్నట్లు ప్రాంతీయ పాస్పోర్టు అధికారి డాక్టర్ విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. దరఖాస్తుదారులు www.passportindia.gov.in వెబ్సైట్లో స్లాట్లను బుక్ చేసుకోవాలని అయన కోరారు.
