తెలంగాణ రాష్ట్ర౦లోని కామారెడ్డిజిల్లా బాన్సువాడలోని కల్కి చెరువు పనులను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ…. రూ.6 కోట్లతో కల్కి చెరువును అభివృద్ధి చేస్తున్నం. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేయాలన్నది తెలంగాణ ప్రభుత్వ ఉద్దేశం. చెరువు మధ్యలో దిమ్మపై తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని తెలిపారు. ప్రజలు సేదతీరడానికి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తాం. నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
