Home / TELANGANA / టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలు

టీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ ,ఇతర పార్టీలకు చెందిన నేతలు ,కార్యకర్తలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు . జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని కాటారం జెడ్పీటీసీ చల్లా నారాయణ రెడ్డితో పాటు నియోజకవర్గ వ్యాప్తంగా రెండు వందల మంది సర్పంచ్ లు,  మహాముత్తారం సింగిల్ విండో చైర్మన్ నర్సింహ్మారెడ్డి, మహదేవ్ పూర్ మాజీ జెడ్పీటీసీ జనగాం సమ్మయ్య, కాటారం మాజీ జెడ్పీటీసీ దుర్గ మల్లయ్య, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి బొమ్మాన బాపురెడ్డి, బీజేపీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బండం బాపురెడ్డిలతో పాటు పలువురు కార్యకర్తలకు మంత్రి ఈటెలతో పాటు ఎమ్మెల్యే పుట్టామథు, ప్రభుత్వ సలహాదారు వివేక్ గులాబీ కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

hyd_bhavan-live-etella-000

వ్యక్తిగత ప్రయోజనాల కంటే వ్యవస్థ ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి ఈటెల తెలిపారు. బంగారు తెలంగాణ సాధనలో సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి మరవలేనిదన్నారు.  టీఆర్ఎస్ పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను పార్టీ గుర్తుంచుకుంటుందన్న ఈటెల. ఎన్ని పార్టీలు ఏకమైనా గులాబీ జెండాకు ఎదురులేదన్నారు. మూడున్నరేళ్లలోనే టీఆర్ఎస్ సర్కార్ పాలనలో రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా మారిందన్నారు.

ఇక మంథని నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి ఎదురులేదని ఎమ్మెల్యే పుట్టమధు తెలిపారు. సీఎం కేసీఆర్  చేస్తున్న అభివృద్దితో మంథని రూపురేఖలే మారిపోయాయన్నారు.సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ప్రభుత్వ సలహదారు వివేక్ తెలిపారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి ఈటెలతో పాటు మంథనికి చెందిన టీఆర్ఎస్ నేతలు, భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు,

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat