హైదరాబాద్తో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వ సూచన నేపథ్యంలో ఇందుకు తగినట్లుగా సీఐఐ తెలంగాణ ముందడుగు వేసింది. హైదరాబాద్ తర్వాత ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న వరంగల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. నిట్ వరంగల్తో పాటు, కిట్స్ కాలేజీ వరంగల్లో కెరీర్ గైడెన్స్ సెషన్స్ను నిర్వహించి పరిశ్రమలో ఉన్న నూతన అవకాశాలు, ఇతర ప్రత్యామ్నాయాల గురించి వివరించారు. ఈ సందర్భంగా సీఐఐ తెలంగాణ చైర్మన్ వి.రాజన్న మాట్లాడుతూ డిజిటల్ రంగంలో టెక్నికల్ విద్యార్థులకు విశేష అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మొబిటిలీ, సోషల్చ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డాటాసైన్సెస్, అనలిటిక్స్కు భవిష్యత్తులో విశేష డిమాండ్ రానుందని…ఈ రంగంలోని అవకాశాలను ఒడిసి పట్టుకోవాలని కోరారు.
సీఐఐ తెలంగాణ హైయ్యర్ఎడ్యుకేషన్ స్కిల్డెవలప్మెంట్ ప్యానెల్ చైర్మన్ కేవీ విష్ణురాజు మాట్లాడుతూ ఉద్యోగాలతో పాటుగా విద్యార్థులు ఎంటర్ప్రెన్యూర్లుగా మారేందుకు కృషి చేయాలన్నారు. నిట్ వరంగల్ వైస్ చాన్స్లర్ ఎన్వీ రమణారావు, కిట్స్ డైరెక్టర్ డాక్టర్ వై మనోహర్ తదితరులు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.