Home / TELANGANA / మూసీ ప్రాజెక్టు ఆధునీకరణకు 65.56 కోట్లు..హరీష్‌రావు

మూసీ ప్రాజెక్టు ఆధునీకరణకు 65.56 కోట్లు..హరీష్‌రావు

 మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ. 65.56 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసినట్లు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ ప్రాజెక్టు ఆధునీకరణ పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం 1954లో చేపట్టి 1961లో పూర్తి చేశారని మంత్రి గుర్తు చేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రాజెక్టు ఆధునీకరణ పనులను గత ప్రభుత్వాలు చేపట్టలేదన్నారు. తూములను, కాలువలను ఆధునీకరించలేదని మంత్రి గుర్తు చేశారు. 30 వేల ఎకరాలకు సాగునీరందించాల్సిన ఈ ప్రాజెక్టు 20 వేల ఎకరాలకు కూడా నీరందించలేకపోతుందన్నారు. ఈ క్రమంలో మంత్రి జగదీష్‌రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్.. ఈ ప్రాజెక్టు ఆధునీకరణ పనులపై సమీక్షించి రూ. 65.56 కోట్ల పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేశారన్నారు. సూర్యాపేట జిల్లాలోని 3 మండలాల్లోని 22 గ్రామాలకు 15 వేల ఎకరాలకు, కుడి కాలువ కింద ఉన్న మూడు మండలాల్లోని పలు గ్రామాలకు 14 వేల ఎకరాలకు పైగా ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ పనులను 18 నెలల్లో పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కింద చివరి ఆయకట్టు వరకు నీరిందిస్తామని మంత్రి ఉద్ఘాటించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat