హైదరాబాద్ పర్యాటకులకు ముఖ్య గమనిక. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ‘ లవ్ హైదరాబాద్ సింబల్’ ఇక నెక్లెస్రోడ్లో కొలువుదీరనుంది. పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తూ ప్రభుత్వం ట్యాంక్బండ్పై ‘లవ్ హైదరాబాద్ సింబల్’ను ఏర్పాటు చేసింది. చుట్టూ ఆకుపచ్చహారం.. ఎత్తయిన బుద్దుడు, బుద్ధుని విగ్రహాన్ని మించి అతి పెద్ద జాతీయ పతాకం..వీటన్నింటినీ కవర్ చేస్తూ లవ్ హైదరాబాద్ వెరసి హుస్సేన్సాగర్ తీరం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా లవ్ హైదరాబాద్ సింబల్ వద్ద సెల్పీలతో సందడి వాతావరణం నెలకొంటోంది. ఐతే ప్రధాన రద్ధీగా ఉండే ట్యాంక్బండ్ ఈ సింబల్ ఉండడం, ఇక్కడ రోడ్లపైకి వచ్చి సెల్పీలతో సందడి చేస్తుండడం, సందర్శకులు తమ తమ వాహనాలను ప్రధాన రోడ్డుపైనే నిలిపి వేయడంతో అటు ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలకు కారణమవుతుంది.
ఈ నేపథ్యంలోనే హుస్సేన్సాగర్ అందాలన్నీ కనిపించే చోటకు ఈ లవ్ హైదరాబాద్ సింబల్ తరలించాలని మంత్రి కేటీఆర్ హెచ్ఎండీఏ అధికారులను ఆదేశించారు. దీంతో ట్యాంక్బండ్ నుంచి నెక్లెస్రోడ్లోని ఫీపుల్ప్లాజా వద్దకు ఈ లవ్ హైదరాబాద్ సింబల్ను హెచ్ఎండీఏ అధికారులు శుక్రవారం తరలించారు. ఈ వేదిక ద్వారా అటు ప్రయాణీకులకు, ఇటు పర్యాటకులకు ఈ లవ్ హైదరాబాద్ కనువిందు చేయనుందని అధికారులు చెబుతున్నారు.
Post Views: 469