ఉస్మానియా విశ్వ విద్యాలయం మానేరు హాస్టల్లో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎమ్మెస్సీ ఫిజిక్స్ తొలి సంవత్సరం చదువుతున్న మురళి అనే విద్యార్థి మానేరు హాస్టల్లోని 159వ నంబరు గది బాత్రూరంలో ఉరి వేసుకుని చనిపోయాడు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఓయూ హాస్టల్కు చేరుకుని పరిశీలిస్తున్నారు. మృతుడి స్వస్థలం సిద్దిపేట్ జిల్లా అని తెలుస్తోంది. మురళీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించే యత్నం చేయగా పోలీసులను విద్యార్థులు అడ్డుకున్నారని సమాచారం.
