క్రమశిక్షణ ఉల్లంఘనపై టీఆర్ఎస్ పార్టీ కఠినంగా వ్యవహరించే అవకాశం సీరియస్గా పరిగణిస్తోంది. ఎమ్మెల్సీ భూపతి రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తీర్మానించారు. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో సమావేశమైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై చర్చించారు.
భూపతి రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని టిఆర్ఎస్ నిజామాబాద్ ఇంచార్జ్, పార్టీ ప్రధాన కార్యదర్శి తుల ఉమను కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. భూపతి రెడ్డి సస్పెన్షన్ పై ప్రజా ప్రతినిధుల తీర్మానానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు తుల ఉమ లేఖ రాయనున్నారు.
కాగా, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ తో పలు సందర్భాల్లో ఎమ్మెల్సీ సంవాదం పెట్టుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ తీరును మార్చుకోవాలని పార్టీ ఆదేశించినప్పటికీ..వినిపించుకో