టీఆర్ఎస్ పార్టీ లోకి వలసలజోరు కొనసాగుతున్నది. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు, యాదాద్రి భువనగిరి జిల్లా టీడీపీ అధ్యక్షుడు సందీప్రెడ్డి మంగళవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో వారు భేటీ అయిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఇవాళ ఇవాళ మంత్రి జగదీష్రెడ్డి సమక్షంలో ఉమామాధవరెడ్డి, ఆమె కుమారుడు టీఆర్ఎస్లో చేరారు. ఈ మేరకు ఉమామాధవరెడ్డి, సందీప్ రెడ్డి టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నారు. ఉమామాధవరెడ్డితోపాటు ఆమె అనుచరులు , పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలతోపాటు రెండువేలమంది టీఆర్ఎస్ లో చేరారు.
