ఇలపావులూరి మురళీ మోహన రావు గారి సౌజన్యం నుంచి..
ఎక్కడా తడుముకోకుండా, తన చిన్నప్పటి గురువులు శర్మగారు, వీరభద్రయ్యగారి గూర్చి జ్ఞాపకాలను తడిమారు. వారికి నిజమైన శిష్యుడు అనిపించుకున్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండీ కూడా తన హోదాను పక్కన పడేసి తన వినయశీలతను, వినమ్రతను చాటుకున్నారు. పదుల సంఖ్యలో పద్యాలను ఆలపించారు. గోరెటి వెంకన్న, అందెశ్రీ లాంటి సమకాలీన కవులను స్మరించారు. ఓహో… అది ఒక ముఖ్యమంత్రి ఉపన్యాసమా? ఒక ప్రొఫెసర్ చెప్పిన పాఠమా? కేసీఆర్ సాహిత్య పరిజ్ఞానం చూసి ఆహుతులు పరవశించిపోయారు. తెలుగుభాష వికాసం కోసం ఒకటి నుంచి ఇంటర్ వరకు తెలుగును కచ్చితంగా చదువుకునే జీవో ను తెచ్చినట్లు ప్రకటించి తెలుగుభాషకు కొత్త ఊపిరులు అందించారు.
ఈరోజు కేసీయార్ చేసిన ఉపన్యాసం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంతటి గొప్ప ఉపన్యాసం ఒక ముఖ్యమంత్రి నోట వినడం నేను ఇదే ప్రధమం. కేసీయార్ విరాట్ రూప ప్రదర్శన నేడు ఆవిష్కృతమైంది…