తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు నగరంలోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. సభలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లికి వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పుష్పాంజలి ఘటించారు.
