Home / TELANGANA / గ‌రిక‌పాటికి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం

గ‌రిక‌పాటికి గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చిన ఉప‌ముఖ్య‌మంత్రి క‌డియం

“తెలుగు మహాసభల్లో ప్రవచనాలు చెప్పమని నన్ను పిలిచారు. కానీ మా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని కనీసం ఆహ్వానించని తెలుగు మహాసభలకు ఆంధ్రకు చెందిన వాడిగా నేను వెళ్లడం భావ్యం కాదని ఆ ఆహ్వానాన్ని సవినయంగా తిరస్కరిస్తున్నాను“ ప్ర‌ముఖ స‌హ‌స్ర అవ‌ధాని గరికపాటి నరసింహారావు మీడియాకు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌.

దీనికి తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఘాటు కౌంట‌ర్ ఇచ్చారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం లో బృహత్ కవి సమ్మేళనంలో పాల్గొన్న గ‌రికపాటి వ్యాఖ్య‌ల‌కు కౌంట‌ర్ ఇచ్చారు. అమెరికా ఆటా సభల్లో పాల్గొన్న సంద‌ర్భంగా గరికపాటి అచ్చమైన తెలుగు తెలంగాణ ప్రజలు మాట్లాడతారు అని చెప్పారని ఈ సంద‌ర్భంగా గ‌తం గుర్తుకు చేశారు. త‌ద్వారా గ‌రిక‌పాటి వ్యాఖ్య‌లుకు కౌంట‌ర్ ఇచ్చారు.

కాగా, స్వచ్ఛమైన తెలుగు తెలంగాణదేన‌ని కడియం శ్రీహరి స్ప‌ష్టం చేశారు.  పల్లె బాషా, సాహిత్యం, పాటలు కనుమరగు అయ్యాయ‌ని పేర్కొంటూ వాటిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంద‌ని ఆయ‌న అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమం, తెలంగాణ ఉద్యమంలో బాషా ఎంతో ఉపయోగప‌డిందని ఉప‌ముఖ్య‌మంత్రి తెలిపారు. తెలంగాణ భాషను, యాసను అవమానపరిచిన ఈ ప్రాంతంలోనే తెలుగు ప్రపంచానికి చాటి చెప్పాలన్న‌ సీఎం కేసీఆర్ సంకల్పం చాలా గొప్పదని ఆయ‌న కొనియాడారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat