సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తోంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో భక్త రామదాసు ఎత్తిపోతల పథకం మొదటి దశను కేవలం తొమ్మిది నెలల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం .. రెండో దశను ఆరు నెలల్లోనే పూర్తి చేసింది. భక్త రామదాసు రెండో దశ ట్రయల్ రన్ విజయవంతమైంది. కేవలం నాలుగు కోట్ల 30 లక్షల రూపాయలతో చేపట్టిన భక్త రామదాసు రెండో దశ.. 16 వేల365 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. దీంతో పాలేరు నియోజకవర్గం ప్రజలకు సీఎం కేసీఆర్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇచ్చిన హామీ నెరవేరింది. రెండో పంటకు పాలేరు జలాలు అందుతుండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత కరువు పీడిత ప్రాంతమైన పాలేరు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేందుకు నిర్మాణం చేసిన భక్తరామదాసు ప్రాజెక్టు పాలేరు ప్రజలకు వరమైంది. నాగార్జున సాగర్ నీరే తలమానకమైన జిల్లాకు గోదావరి నీళ్లను తీసుకొచ్చి మరింత సస్యశ్యామలం చేసేందుకు చేపట్టిన అద్భుతమైన ప్రాజెక్టు సీతారామ ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయ. ఆ ప్రాజెక్టు కచ్చితంగా జిల్లాకు వరం కానుంది. తద్వారా ఖమ్మం జిల్లాలో కృష్ణా,గోదావరి కలియకతో సాగునీటి సమస్యకు శాశ్వతంగా పుల్స్టాఫ్ పడనుంది. ప్రతి ఎకరానికి సాగునీటిని అందించాలనే లక్ష్యంతో మంత్రి తుమ్మల అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అంతే కాకుండా మున్నేరు, ఆకేరు, పాలేరు, వైరా, కిన్నెర సాని, ఇతర నదులపై చెక్డ్యాం కం వంతెనలు నిర్మాణం చేస్తున్నారు. ఇలా ఉమ్మడి జిల్లాలో అద్భుతంగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.