తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జర్నలిస్టులది కీలక పాత్ర అని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే.తారక రామారావు అన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా మిలియన్ మార్చ్,సాగరహరం సందర్భంగా జర్నలిస్టుల పై దాడులు జరిగాయి. అలాగే ఉస్మానియా యూనివర్సిటీ లో కూడా పోలీసులు మీడియా పై దాడి చెసి కెమెరాలను,మొటార్ సైకిళ్ళను ధ్వంసం చేశారు. అయితే పోలీసు స్టేషన్ లలో ఎఫ్ఐఆర్ లు నమోదు అయిన కేసుల్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చిన అనంతరం చాలా మంది జర్నలిస్టులకు, ఫోటోగ్రాఫర్లు వారు పొగొట్టుకున్న విలువైన వస్తువులు, కెమెరాలను,మోటార్ సైకిళ్ళను ఇప్పించారు. అట్లాగే నష్టపరిహారం కూడ కొంత చెల్లించారు. చివరగా తొమ్మిది మంది ఫోటోగ్రఫర్లకు ఒక్కోకరికి ఒక లక్ష డెబ్భై నాలుగు వేల రూపాయల విలువ గల నికాన్ కెమెరా లను కేటీఆర్ చేతుల మీదుగా ఐచ్చారు.
శనివారం నాడు ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫొటోగ్రాఫర్లకు కెమెరాలను అందజేశారు. మీడియా అకాడమీ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(143), తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్, గతంలో మంత్రి కేటీఆర్కు ఈ కెమెరామెన్ ల సమస్యలను వివరించి చెప్పగా మంచి మంత్రి చొరవ తీసుకుని క్యాంపు కార్యాలయంలో కెమెరాలను పంపిణీ చేశారు. కెమెరాలను పొందిన కెమెరామెన్లు మంత్రి కేటీఆర్ ,చైర్మన్ అల్లం నారాయణ , సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ కు కృతజ్ఞతలు తెలిపారు.