రాజకీయ నేతలను సోషల్ మీడియాలో విమర్శిస్తున్న వారిపై ఇటీవల చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలపై ముగ్గురు యువకులను సూర్యపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేసినట్లు జిల్లా యస్.పి ప్రకాష్ జాదవ్ తెలిపారు. అరెస్టయిన వారిలో సూర్యపేట పట్టణానికి చెందిన నాగేందర్, కళ్యాణ్, సంపత్ ఉన్నారని ఆయన తెలిపారు.
