తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నాడని రాష్ట్ర విద్యుత్ ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు . నల్లగొండ జిల్లా కేంద్రంలోని చినవెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్లో సుశృత గ్రామీణ వైద్యుల సంఘం 11 మహాసభలకు ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడారు. పీఎంపీలు, ఆర్ఎంపీలు గ్రామీణ స్థాయిలో ప్రజలకు మంచి వైద్యం అందించాలని ఈ సందర్భంగా వారికి సూచించారు .ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ తుంగతుర్తి ఎమ్మెల్యేలు నలమోతు భాస్కర్రావు, గాదరి కిషోర్, టిఆర్ఎస్ నల్లగొండ నియోజకవర్గ ఇంచార్జీ కంచర్ల భూపాల్ రెడ్డి సుశృత గ్రామీణ వైద్యుల సంఘం నేతలు పాల్గొన్నారు.
