ప్రముఖ కవి, గాయకుడు గోరటి వెంకన్న ఈ ఏడాది అరుణ్సాగర్ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. అరుణ్సాగర్ జయంతి సందర్భంగా జనవరి 2న తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో గోరటి వెంకన్నకు ఈ పురస్కారం ఇచ్చి సత్కరించనున్నారు. ఆంధ్రజ్యోతి సంపాదకులు కే శ్రీనివాస్, ప్రముఖ కవులు కే శివారెడ్డి, డాక్టర్ ప్రసాదమూర్తి, మువ్వా శ్రీనివాసరావు, ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మతో కూడిన జ్యూరీ గోరటి వెంకన్నను అరుణ్సాగర్ సాహితీ పురస్కారానికి ఎంపికచేసింది. అరుణ్సాగర్ ట్రస్ట్ నిర్వహణలో ఈ కార్యక్రమం జరుగనున్నది.
