Home / TELANGANA / “మనం సైతం” కు సంపూర్ణ సహకారం..టీన్యూస్ ఎండీ సంతోష్‌కుమార్

“మనం సైతం” కు సంపూర్ణ సహకారం..టీన్యూస్ ఎండీ సంతోష్‌కుమార్

మనం సైతం సేవా కార్యక్రమానికి తను సంపూర్ణ సహాయసహకారాలు అందిస్తానని “టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, టీన్యూస్ ఎండీ జోగినపల్లి సంతోష్‌కుమార్” భరోసా ఇచ్చారు. మాటల్లో కాకుండా చేతల్లో ఈ కార్యక్రమ ఉన్నతికి తోడ్పాటునందిస్తానని ప్రకటించారు. చలనచిత్ర పరిశ్రమలోని 24 విభాగాల కార్మికులతోపాటు కష్టాల్లో ఉన్న సామాన్యులకు తోడ్పాటునందించే ఉద్దేశంతో సినీనటుడు కాదంబరి కిరణ్ బృందం మనం సైతం పేరుతో ఓ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. అనారోగ్యంతోపాటు వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు బాధిత కుటుంబాలకు మనం సైతం ఆదివారం హైదరాబాద్‌లో ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంతోష్‌కుమార్, సినీ నటులు రాజేంద్రప్రసాద్, అల్లరి నరేశ్‌తో కలిసి బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేశారు.

మనం సైతం కార్యక్రమానికి తనవంతుగా సంతోష్‌కుమార్ రెండు లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరికీ ఇబ్బంది కలుగకుండా బాధల్లో ఉన్నవారి మోముల్లో నవ్వులు పూయించాలని చెప్పారు. రాజేంద్రప్రసాద్, అల్లరి నరేశ్.. రెండుతరాల నటుల నవ్వుల సాక్షిగా ఈ మాట చెబుతున్నానని అన్నారు. నేను అందిస్తున్న చేయూతపై ఓ పుస్తకమే రాయొచ్చని కాదంబరి కిరణ్ అన్నారు. ఆయన నాపై చూపిస్తున్న ప్రేమకు అది నిదర్శనం. మనం సైతంలో తనకు ఓ పేజీ ఉండాలని కోరుకుంటున్నా అని సంతోష్‌కుమార్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు సినీనటులు, మనం సైతం సభ్యులు పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat