లోక కల్యాణార్థం సిరిసిల్లలో శ్రీహరిహరపుత్ర అయ్యప్ప ట్రస్టు సేవాసమితి ఆధ్వర్యంలో ఇవాల్టి నుంచి ఐదు రోజులపాటు మూడు కోట్ల వ్యయంతో అయుత మహాచండీయాగాన్ని నిర్వహిస్తున్నారు. 1100 మంది రుత్వికులు, దేశంలోని వివిధ రాష్ర్టాలకు చెందిన పీఠాధిపతుల చేతుల మీదుగా ఈ యాగం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. యాగంకోసం చండీ, పరదేవతల విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించి ప్రతిష్ఠించారు. రోజూ పదివేలమందికి అన్నదానం చేయనున్నారు. సామాన్యులు సైతం పాల్గొనేలా హోమగుండాలను ఏర్పాటు చేస్తుండటం దేశంలోనే ఇదే తొలిసారని నిర్వాహకులు తెలిపారు . ఈ యాగానికి సీఎం కేసీఆర్ సతీమణి శోభ, మంత్రి కేటీఆర్, కరీంనగర్ ఎంపీ వినోద్కుమార్, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఈటల రాజేందర్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీన్యూస్ ఎండీ జోగినపల్లి సంతోష్కుమార్లు పాల్గొంటారు.
