తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని జూలపల్లి టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, సింగిల్విండో చైర్మన్ నల్ల మనోహర్రెడ్డి అన్నారు.జూలపల్లి మండల కేంద్రంలో కేసీఆర్ సేవాదళ్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మడ్డి శ్రావణ్ అధ్యక్షతన జరిగిన కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా అయన హాజరయ్యారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పొరేషన్ రుణాలు అందించి అనగారిన వర్గాల ప్రజల అభ్యున్నతికి ముఖ్యమంత్రి తోడ్పడుతున్నారని స్పష్టం చేశారు. యువత గ్రామాల్లో పారిశుధ్యం, సేవా కార్యక్రమాల్లో భాగస్వాములై ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 70మంది యువకులు కేసీఆర్ సేవాదళంలో చేరగా, వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాఠకుల అనిల్, తాటిపల్లి రాజలింగం, నాడెం మల్లారెడ్డి, మొగురం రమేష్, ఎండీ ఖాసీం, కొట్టె రాజయ్య, కనుకుంట్ల అంజయ్య, కనకరాజు తదితరులు పాల్గొన్నారు.