ప్రజా సమస్యలు తీర్చడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలోని మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట మధు చేపట్టిన మన ఊరు -మన ఎమ్మెల్యే కార్యక్రమానికి అన్ని వర్గాల నుండి మంచి స్పందన లబిస్తుంది . ప్రతిక్షణం ప్రజలతో మమేకమవుతూ.. వారి సమస్యలను తెలుసుకోవడం తో పాటు వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కారానికి చొరవ చూపుతున్నారు .తమ సమస్యలను తమ ఎమ్మెల్యే నే దగ్గరుండి మరి పరిష్కరిస్తుండటంతో అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కాగా మొదటి రోజు లోంక కేసారం , కల్వచర్ల గ్రామాల్లో ఎమ్మెల్యే పుట్ట మధు పర్యటించారు.