Home / TELANGANA / కేసీఆర్ ఆనాడు చెప్పారు..నేడు ఆచ‌ర‌ణ‌లో చూపారు..మంత్రి హ‌రీష్‌

కేసీఆర్ ఆనాడు చెప్పారు..నేడు ఆచ‌ర‌ణ‌లో చూపారు..మంత్రి హ‌రీష్‌

ఉద్య‌మ నాయ‌కుడిగా పోరాట స‌మ‌యంలో చెప్పిందే…పాల‌కుడిగా ప్ర‌స్తుతం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చేసి చూపిస్తున్నార‌ని మంత్రి హరీష్ రావు తెలిపారు. టీఎన్జీవో డైరీ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ 2018 వ సంవత్సరం సమస్యల పరిష్కారానామ సంవత్సరం అన్నారు. `ముఖ్యమంత్రి గారికి ఎన్జీవోలు అంటే ఎంతో ప్రేమ. గత ప్రభుత్వ లు సమస్యల పరిష్కారానికి వస్తే గుర్రాలతో తొక్కించారు వాటర్ కానన్ లతో తొక్కించారు. కానీ ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కు పీల్చుకొని అన్నం పెట్టి మీకు ఎం కావాలని అడిగి జీతాలు పెంచిన ఘనత మన ముఖ్యమంత్రి గారిది` అని వివ‌రించారు.

గతంలో ఎక్కడ కూడా ఆశావర్కర్లు జీతాలు పెంచిన దాఖలాలు లేవు కానీ జీతాలు పెంచి గౌరవంగా బతికేల చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ద‌ని మంత్రి హ‌రీశ్ రావు చెప్పారు. `కాంట్రాక్ట్ లెక్చరర్ లను రెగులర్ చేస్తాం అనుకుంటే కొంత మంది కోర్టుకు వెళ్లి అపి పరిస్థితి మనం చూశాం కానీ వారి జీతం పెంచిన ఘనత కూడా మన ముఖ్యమంత్రిదే.  అనేక సమస్యలు ఎదుర్కొంటున్న కరెంట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాము. దేవాలయాలలో ఉన్న అర్చకులకు క్యాంప్ ఆఫీస్ పిలిచి వారికి తిండి పెట్టి వేతనాలు పార్టీ టీఆరెస్ పార్టీ. ఈ దేశంలో ఎక్కడైనా హెల్త్ కార్డ్స్ చేశారా కానీ మన రాష్ట్రంలో హెల్త్ కార్డ్స్ మీ కుటుంబ సభ్యులకు అందరికి హెల్త్ పాలసీ ఇచ్చిన పార్టీ టీఆర్ఎస్‌.` అని మంత్రి హ‌రీష్‌ రావు వివ‌రించారు.

`మీరు 43 శాతం ఫిట్మెంట్ అడిగారు కానీ ముఖ్యమంత్రి 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. విభజన చట్టం ఉన్న లొసుగులు ఉన్న మాట వాస్తవం. కొన్ని సమస్యలు ఎదుర్కుంటున్నాం. కొంతమంది ఉద్యోగులను ఇప్పటికే తీసుకావచ్చాము. ఇరిగేషన్ శాఖ లో కూడా ఇదేవిదంగా ఉండే సూపర్ న్యూమర్ పోస్టులు క్రియేట్ చేసి వారిని ఇక్కడకు తీసుకువచ్చాము. విభజన చట్టం ప్రకారం ఉద్యోగులను ఇక్కడకు తీసుకువచ్చే కమిటీలో నేను కూడా ఉన్నాను అక్కడి ప్రభుత్వ నుండి సరైన స్పందన లేదు. ఇప్పటికూడా ఇక్కడ ఖాళీ భవనాలకు తాళాలు వేసుకొనిపోయారు.` అని వ్యాఖ్యానించారు.

`ఉద్యమంలో ఏ రాత్రి వరకు పని చేశామో ఇప్పుడు కూడా ఉద్యమ స్ఫూర్తి తో అదే రాత్రిమభవాళ్ళు పనిచేస్తున్నారు. మాకు ఏనాడు కుడా ఏ దేశం టూర్ పోవాలి అనిలేదు. ఇప్పటికే అనేక అవార్డ్స్ వచ్చాయి. 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రం. దీనిపైనా కొంత మంది రాజకీయ నాయకులు ఏమేంమో మాట్లాడుతున్నారు 24 గంటలు అవసరంలేదు. మరికొందరు ఫుల్ పేజీ ప్రకటనలు అవసరమా….

అయితే రాష్ట్రం ఏర్పడిన కొత్తలో సభలో సీఎం కేసీఆర్ మేము 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం అంటే ప్రతిపక్ష నాయకుడు ఇది సాధ్యమా….ఇది గిట్ల మీరు చేస్తే నేను మీ పార్టీ లో కార్యకర్త గా పనిచేస్తా అన్నాడు  కానీ మేము చేసి సాధించాం. మీరు అధికారంలో ఉంటే ఇంకా 2 సంవత్సరాలు అయిన మీకు సాద్యం కాకపోవు. మీరు అంటున్నారు ఎంత ఉత్పత్తి చేశారు అని ఎస్ మేము చేశాం భూపాలపల్లి ప్లాంట్ ద్వారా 600 మెగా వాట్స్…సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ద్వారా 1200 మెగా వాట్స్ విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నాం.ఇంకా 800 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నము. తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేద్దాం రాండి అంటే ఒక్కడు జేఏసీ నుండి పరారు..ఇంకొక్కడు జిరాక్స్ కాఫీలు పారారు అయిన్రు తెల్వదా ప్రజలకు.. వారు ఆనాడు రాష్ట్ర సాధనలో కల్సి రాలేరు…ఈనాడు రాష్ట్ర  అభివృద్ధిలో కల్సి రాలేదు` అని మంత్రిహ‌రీష్ రావు అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat