తెలంగాణ బీజేపీ నేతలకు ఆ పార్టీ జాతీయ నాయకుడు తలంటినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ కార్యాలయానికి వచ్చిన ఆ పార్టీ నాయకుడు…తెలంగాణ బీజేపీ నేతల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ పార్టీ నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
తెలంగాణలో పార్టీ నేలు శ్రమించాల్సి ఉండగా…పర్యటనలకు పార్టీ బలోపేతం వంటి కార్యక్రమాలు చేపట్టడం లేదని ఆయన అసంతృఫ్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రాల్లో గెలుస్తూ ఉన్నామని కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదని వివరించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర నాయకత్వం మరింత పనిచేయకపోతే కష్టమని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.