చనాకా_కోరటా ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పనులునత్త నడకన సాగుతుండటంపై ఇటు ఇరిగేషన్ అధికారులు, అటు ఏజెన్సీల పట్ల మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజు 1000 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు జరగని పక్షంలో ఏజెన్సీని మార్చుతామని ఆయన హెచ్చరించారు. చనాకా _కోరాట పనులను మంత్రి శనివారం నాడిక్కడ జలసౌధలో సమీక్షించారు.15 రోజులలో పనుల పురోగతి లేకపోతే సంబంధిత ఏజెన్సీలపై అగ్రిమెంటు క్లాజు ప్రకారం చర్యలు తీసుకోవాలని హరీష్ రావు ఆదేశించారు.
చనాకా _కొరటా బ్యారేజే,పంపు హౌజ్,గ్రావిటీ కెనాల్, సబ్ స్టేషన్ లు, టవర్ల నిర్మాణం, గెట్ల నిర్మాణం, బిగింపు తదితర పనులను హరీష్ రావు సమీక్షించారు. ఈ ప్రాజెక్టు పనులు అనుకున్నంత వేగంగా జరగకపోవడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్చి నెలాఖరులోపున బ్యారేజి పియర్స్ ను బ్రిడ్జి లెవల్ వరకు లేపాలని, ఈ లోగా గెట్ల మేనుఫ్యాక్చరింగ్ పూర్తి చేయాలన్నారు. వెనువెంటనే గెట్లను బిగించాలని కోరారు. జనవరి 15 లోపు సర్జ్ పూల్ డిజైను , డెలివరీ సిస్టమ్, ప్రజర్ పైపు లైను వ్యాలీ క్రాసింగు డిజైన్లను పూర్తి చేయాలని సి.డి.ఓ .సి.ఈ. ని ఆదేశించారు. మిగిలిన పైపులైను నిర్మాణాన్ని మార్చి చివరిలోగా పూర్తి చేయాలని హరీష్ రావు కోరారు.పవర్ లైన్స్ ఏర్పాటుకు 11 లొకేషన్స్ లో భూయజమానులతో ఇబ్బందులు ఉన్నట్టు ట్రాన్స్ కొ డైరెక్టర్ సూర్యప్రకాశరావు మంత్రికి తెలిపారు. దీనిపై ఆదిలాబాద్ జిల్లా మంత్రి జోగు రామన్నతో హరీష్ రావు ఫోన్ లో మాట్లాడారు. రెండు, మూడు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించాలని హరీష్ రావు కోరారు.ట్రాన్స్ కొ డైరెక్టర్ సూర్యప్రకాశరావు, ఈ.ఎన్.సి.మురళీధరరావు,ఎస్.ఈ.అం