ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజనీర్లు తెలంగాణ ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురిపించారు.ఇవాళ సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్ట్ దగ్గర మిషన్ భగీరథ పనులను నాబార్డ్ ప్రతినిధులతో కలిసి వారు పరిశీలించారు.ప్రతి ఇంటికి నల్లా ద్వారా సురక్షిత తాగునీరు అందించాలనే తెలంగాణ ప్రభుత్వ ఆలోచన బాగుందని తెలిపారు.సీఎం కేసీఆర్ చిత్తశుద్ధి వలన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని వారు కొనియాడారు. తమ రాష్ట్రంలో కూడా మిషన్ భగీరథ తరహా ప్రాజెక్టును అమలు చేసే ఆలోచనలో ఉన్నామని వారు తెలిపారు.
