తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు కేంద్రంలో ప్రశంసలు అందుతున్నాయని కరీంనగర్ ఎంపీ వినోద్అన్నారు . ఇవాళ ( బుధవారం ) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పంట పెట్టుబడి దేశంలోని రైతులందరికి ఇవ్వాల్సిన అవసరం ఉందని మేధావి వర్గాలు చెబుతున్నాయని తెలిపారు. రైతు అప్పుల పాలు కాకుండా, భరోసా ఇచ్చేలా, ఆర్థికంగా కూడా నిలదొక్కు కుంటారని ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని వివరించారు.ఈ సారి పార్లమెంట్ ఈ బడ్జెట్ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదాను అడుగుతామని అన్నారు.ఈ సమావేశంలో వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
see also : పెట్టుబడులు సాధించడంలో కేటీఆర్ ఘనవిజయం..!
see also : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం.. టాప్ గేర్లో దుసుకుపోతున్న కారు..!