కంది రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్నీ మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర పౌర సరఫరాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు లేఖ రాశారు.కందుల కొనుగోళ్ల పరిమితిని పెంచాలని కోరారు. ఈ సీజన్ లో కందులు 2 లక్షల 84 వేల మెట్రిక్ టన్నుల కు పైగా కందుల దిగుబడి రానుందని హరీశ్ రావు చెప్పారు.
కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని,కంది రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని మార్కెటింగ్ మంత్రి కోరారు. కనీసం మరో లక్ష మెట్రిక్ టన్నుల కంది కొనుగోలు కోసం సంబంధిత ఏజన్సీల ను ఆదేశించాలని కోరారు