స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ తన ప్రస్థానాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నదో వివరించారు. దేశంలో ఆయా రాష్ర్టాలకు ఆదర్శంగా తమ పాలన ఎలా మారిందో వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన 51వ స్కోచ్ సదస్సులో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో వృద్ధిరేటు, ప్రాంతాల అభివృద్ధి, నైపుణ్యాల అభివృద్ధిపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. దేశంలోనే అన్ని రంగాల్లో తెలంగాణ ముందుకు వెళ్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్ కృషితో విద్యుత్ సమస్యలను అధిగమించి విద్యుత్ మిగులు రాష్ట్రంగా అవతరించిందని పేర్కొన్నారు.
see also :కామెడీ చేసేందుకు టీ కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయమిది!
స్టేట్స్ ఆఫ్ ఇన్ క్లూజివ్ గ్రోత్, రీజినల్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ అంశాలపై చర్చ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని, సంస్కరణలను సమ్మిట్ లో వివరించారు. తమ ప్రభుత్వం గడిచిన మూడున్నరేళ్లుగా సమ్మిళిత అభివృద్ధి సాధిస్తోందని, దానికి సంబంధించి అందరికీ వివరించాలని తనను ఆహ్వానించారని మంత్రి వివరించారు. `మౌలిక సదుపాయాల కల్పన కోసం తెలంగాణ ఏర్పడ్డప్పటి నుండి కృషి చేస్తున్నాం. దేశంలో అన్ని రాష్ట్రాలకంటే ఎక్కువగా సోలార్ విద్యుత్తును తయారుచేస్తున్నాం. ప్రస్తుతం 3300మెగా వాట్ల సోలార్ తయారుచేస్తున్నాం. రాబోయే రోజుల్లో 5500మెగావాట్ల టార్గెట్ తో పనిచేస్తున్నాం. డబుల్ బెడ్రూం పథకాన్ని ఎంతో విజయవంతంగా అమలుచేస్తున్నాం. 46వేల చెరువులను పునరుద్ధరించాం. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికాభివృద్ధి జరుగుతోంది. దేశంలో ఎక్కడాలేనివిధంగా పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తున్నాం` అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
see also :సొంతగూటికి కాంగ్రెస్ నేత ..!
పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్రం తీసుకువచ్చిన ఇండస్ట్రియల్ పాలసీపై మంత్రి కేటీఆర్ వివరించారు. `దేశంలోనే ఇలాంటి వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టింది తెలంగాణ ఒకటేనని అన్నారు. `రాష్ట్రం పెట్టబడులకు అనువైన ప్రాంతం. మనదేశంలో నదుల్లో నీటి లభ్యత ఉన్నప్పటికీ 75వేల టీఎంసీల నీళ్ళు సముద్రంలో వృధాగా కలుస్తున్నాయి. ఇది మారాలి అనే మా ముఖ్యమంత్రి కేసీఆర్ నినదిస్తున్నారు` అని పేర్కొన్నారు.