ఉద్యోగుల, ఉపాధ్యాయుల అంశాలకు సంబంధించిరాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అధ్యక్షతన ఏర్పాటయిన మంత్రివర్గ ఉప సంఘం ఈ నెల 11వ తేదిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు నివేదిక సమర్పించనుంది. మంత్రులు ఈటెల రాజేందర్, కెటి. రామారావు, జగదీష్ రెడ్డి ఇప్పటికే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరిపారు. నివేదికను రూపొందిస్తున్నారు.
మంత్రివర్గ ఉప సంఘం సమర్పించిన నివేదికను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో చర్చిస్తారు. 14వ తేది మధ్యాహ్నం 2 గంటలకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి సమావేశమై నిర్ణయాలు తీసుకుంటారు.