తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని అనామిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట లో గల CC నగర్ లోని అనామిక అమ్మమ్మ ఇంటికి మంత్రి శ్రీనివాస్ యాదవ్ వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన కోరారు. ఆయన వెంట బన్సీలాల్ పేట కార్పొరేటర్ హేమలత ఉన్నారు
