అమెరికా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సాహిత్ రెడ్డి కుటుంబ సభ్యులను రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినీమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఆడిక్ మెట్ పద్మాకాలనీలోని వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సాహిత్ రెడ్డి మృతి చాలా బాధాకరం అన్నారు. సాహిత్ రెడ్డి పార్ధీవ దేహాన్ని ఇక్కడకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని ఆయన చెప్పారు.
