ప్రముఖ చిత్రకారుడు సూర్యప్రకాశ్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ చిత్రకళకు అంతర్జాతీయ స్థాయి ఖ్యాతిని ఆర్జించి పెట్టిన చిత్రకారుడిగా సూర్యప్రకాశ్ చరిత్రలో నిలిచిపోతారని ముఖ్యమంత్రి అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఖమ్మం జిల్లా మధిరలో జన్మించిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. మొదట ఆయన సీసీఎంబీకి రెసిడెన్సియల్ ఆర్టిస్టుగా పనిచేశారు. ప్రస్తుతం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రిలో రెసిడెన్సియల్ ఆర్టిస్టుగా పనిచేస్తున్నారు.
