తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తన గోప్ప మనస్సును చాటుకున్నారు. సోమవారం మంత్రి మల్లారెడ్డి హైదరాబాద్ నగరంలో పర్యటిస్తుండగా.. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ చౌరస్తాలో రోడ్డు ప్రమాదం జరిగింది.సైకిల్పై వెళుతున్న వ్యక్తికి లారీ ఢీకొట్టింది. సైకిల్ మీద వెళ్లుతున్న వ్యక్తి కాలు లారీ వెనుక టైరు కిందపడి నుజ్జునుజ్జైన అయింది. ఇంతలో అటుగా వస్తున్న మంత్రి మల్లారెడ్డి చూసి వేంటనే కారు ఆపి ఆ వ్యక్తిని పైలెట్ వాహనంలో వైద్యం కోసం సూరారంలోని నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్కు తరలించారు. అంతేకాకుండా మంత్రి మల్లారెడ్డి స్వయంగా ఆసుపత్రి వరకు వెళ్లి సదరు వ్యక్తికి వైద్య చికిత్స చేయించి బాగోగులు చూసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు నేటీజన్లు మంత్రి మల్లారెడ్డి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.