Home / TELANGANA / జూలై చివరి నాటికి ఎస్సారెస్పీకి కాలేశ్వరం నీరు..!!

జూలై చివరి నాటికి ఎస్సారెస్పీకి కాలేశ్వరం నీరు..!!

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ పునర్జీవ పథకం లో బాగంగా  వరద కాలువ ద్వారా కాలేశ్వరం నీటిని జూలై 20 తర్వాత ఎస్సారెస్పీ ప్రాజెక్టు ను  నింప నున్నట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు రవాణా శాసనసభ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి  వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుధవారం ఎస్సారెస్పీ పునర్జీవ పథకంలో భాగంగా వరద కాలువ జీరో పాయింట్ వద్ద 420 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే మూడవ పంపింగ్ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం  మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అద్భుతమైనదని 200 కిలోమీటర్ల దూరం నుండి ఎగువకు నీరు తెచ్చి గత కొన్ని సంవత్సరాలు ఎండిపోతున్న ఎస్సారెస్పీకి జలకళ నిండు కుండల ఉండేందుకు ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు చెప్పారు. ఎస్సారెస్పీ ప్రాజెక్ట్  ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ నల్గొండ ఆదిలాబాద్ జిల్లాలోని రైతుల బాగుపరిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి 200 కిలోమీటర్ల దూరం నుండి కాలేశ్వరం ప్రాజెక్టు రివర్ సింగ్ పంపింగ్ ద్వారా ఎస్సారెస్పీ నిండేందుకు 1080  కోట్ల అంచనా వ్యయంతో చేపట్టినట్లు  ఇది అద్భుతమైన ప్రాజెక్టు చరిత్రలో కనివిని ఎరుగనిదని చెప్పారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం మరొక ఇరిగేషన్ ప్రాజెక్టు లాంటిదని ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్ చరిత్రలో అద్భుతమని రాబోయే కాలంలో బాల్కొండ లక్ష్మి కెనాల్ రైతులకు సరిపడా సాగునీరు అందించి  వారి పంటలను సస్యశ్యామలం చేస్తాయని చెప్పారు 365 రోజులు ప్రాజెక్టు కళకళలాడుతుందని కాలేశ్వరం ప్రాజెక్టు 21వ ప్యాకేజ్ ద్వారా బాల్కొండ నియోజవర్గంలో 72 వేల ఎకరాల ఆయకట్టును సాగునీరు అందించనున్నట్లు కమ్మర్పల్లి వేల్పూరు భీంగల్ మోర్తాడ్ మండలాలు ప్రయోజనం కలుగుతుందని అదేవిధంగా గుత్ప అలీసాగర్ ద్వారా ఆర్మూర నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక లక్ష 3 ఎకరాలకు సాగునీరు అందించవచ్చునని పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా నిర్మించే రాంపూర్ రాజేశ్వర రావు పేట్ mupkal పంపింగ్ ద్వారా ఎస్ ఆర్ ఎస్ పి పూర్తి స్థాయిలో నింపి కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్యాకేజ్ 22 ద్వారా కామారెడ్డి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల లోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందించనున్నట్లు నిజాంబాద్ ఉమ్మడి జిల్లాలో సుమారు నాలుగు లక్షల ఎకరాలు పూర్తి ఆయకట్టు సాగునీరు అందుతుందని అందులో ఒక లక్ష 30 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ మరో 2 లక్షల70 వేల ఎకరాల నూతన ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్లు ఈ ప్రాజెక్టును తొందరగా పూర్తి  చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు కాలేశ్వరం ప్రాజెక్టు ద్వారా సెప్టెంబర్ మాసంలో 20 నుండి 30 టిఎంసిలు mid మానేరు నుండి అక్కడినుండి ఎస్సారెస్పీకి వచ్చే అవకాశం ఉందని ఎస్ ఆర్ ఎస్ పి కి రెండు మోటార్ల ద్వారా రోజుకు ఒక టీఎంసీ పంపించవచ్చునని పునర్జీవ ప్రాజెక్టులో భాగంగా మూడో పంపింగ్ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేసి 1.6 tmc ప్రతిరోజు  పంపింగ్ చేయవచ్చునని మంత్రి చెప్పారు మూడవ పంపింగ్ పనుల ప్రక్రియలో రెగ్యులేటరీ సంబంధించిన 9 గేట్ల ఫిట్టింగ్ పనులు 15 రోజుల్లో పూర్తి చేసి జూలై 20 తర్వాత రాంపూర్ రాజేశ్వర రావు పేట సంబంధించిన రెండు పంపింగ్ ద్వారా నేరుగా ఎస్సారెస్పీ లోకి వెళుతుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వివరించారు

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat