కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి ఈటల రాజేందర్. ఇవాళ మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్ కాలేజీల ఏర్పాటుతో పేదలకు సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని ఈటల చెప్పారు.
