Home / TELANGANA / రైతు బంధు అన్ని రాష్ట్రాలకు ఆదర్శం.. యూపీ వ్యవసాయ శాఖ మంత్రి

రైతు బంధు అన్ని రాష్ట్రాలకు ఆదర్శం.. యూపీ వ్యవసాయ శాఖ మంత్రి

రైతు బంధు పథకం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని యూపీ వ్యవసాయ శాఖ మంత్రి సూర్యప్రతాప్ సాహి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విత్తన పార్కు ఏర్పాటు చేయబోతుంది. ఈ విత్తన పార్క్‌పై అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ఆధ్వర్యంలోని ఓ బృందం ఈ రోజు రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా వ్యవసాయ విత్తన రంగ అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి మంత్రి నిరంజన్ రెడ్డి వారికీ వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సూర్యప్రతాప్ సాహి మాట్లాడుతూ.. విత్తన రంగంలో తెలంగాణ ఏంతో ప్రగతి సాధించింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని యూపీ లో కూడా విత్తన పార్క్ కోసం ప్రణాళికలు రూపొందిస్తాం అని అన్నారు. అనంతరం మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత వ్యవసాయ రంగం అభివృద్ధి కి అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు శాఖ కార్యదర్శులు, డైరెక్టర్‌లతో యూపిలో ఒక్క ప్రత్యేక సమావేశంని ఏర్పాటు చేయలని మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం విత్తన రంగ అభివృద్ధికి అన్ని చర్యలు చేపడుతోంది. దేశంలోనే ఇతర రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకు కూడా విత్తనాలను అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ. విత్తన పార్క్ అభివృద్ధికి విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్ యూనిట్లు, గోదాముల, అధునాతన శీతల గిఫ్దంగులు,ల్యాబులు, 150 ఎకరాలలో ఏర్పటు చేయడానికి ప్రణాళికలు రూపొందించామని ఆయన అన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat