టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ను నాగర్కర్నూల్ ఎంపీ రాములు సోమవారం కలిశారు. నల్లమల్ల అడవుల్లో యురేనియం తవ్వకాలపై ఎలాంటి అనుమతులు ఇవ్వమని అసెంబ్లీ తీర్మానం చేసిన నేపథ్యంలో కేటీఆర్కు రాములు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ను కలిసిన అనంతరం రాములు మీడియాతో మాట్లాడారు. ప్రజా వ్యతిరేక విధానాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం దూరమని సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారని పేర్కొన్నారు. ప్రతిపక్షాల అనవసర ఆరోపణలు చెంపపెట్టుగా తీర్మానం చేశారని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు యురేనియం తవ్వకాల విషయంలో కేంద్రంపై పోరాటం చేయాలని సూచించారు. సమయం వచ్చినప్పుడల్లా పార్లమెంట్లో ఈ విషయంపై మాట్లాడాలని మంత్రి కేటీఆర్ సూచించారు అని ఎంపీ రాములు తెలిపారు.