ఖరీఫ్లో రైతుబంధు రానివారికి త్వరలో అందజేస్తామని మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మాట్లాడిన ఆయన ఇప్పటివరకు 39.72 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశామని చెప్పారు. మొత్తం రైతు బంధు పథకం కింద 56.76 లక్షల మంది అర్హులు ఉన్నారని …రైతులకు చెల్లింపులు ప్రాసెస్లో ఉన్నాయని తెలిపారు. గతేడాది రైతుబంధు పథకం కింద రూ.10,505 కోట్లు చెల్లించామని…ఈ ఏడాది నుంచి ఎకరానికి పంటకు రూ. 5 వేల చొప్పున రెండు పంటలకు రూ. 10 వేలు ఇస్తున్నామని తెలిపారు. రైతుబంధు, రైతు బీమా పథకాల్లో ఎలాంటి మార్పులు ఉండవన్నారు. కేంద్ర ప్రభుత్వ కిసాన్ సమ్మాన్ యోజన పథకంతో…రైతులకు పెద్దగా మేలు జరగదని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మొక్కుబడిగా, కంటితుడుపు చర్యగా కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. తెలంగాణ ప్రభుత్వ రైతుబంధు పథకంలో ఎలాంటి ఆంక్షలు లేవన్నారు. పోడు భూములపై త్వరలో కొత్త పాలసీ తీసుకొస్తామని మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు.