రాష్ట్రంలో నీరా పాలసీని ప్రవేశపెట్టి ప్రత్యేక స్టాళ్ల ద్వారా అమ్మకాలు చేపడతామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ప్రయోగాత్మకంగా హైదరాబాద్లోని టాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ఆధునిక రెస్టారెంట్లను ఏర్పాటు చేసి వాటి ద్వారా తెలంగాణ వంటకాలతో పాటు నీరా అమ్మకాలను ప్రోత్సహిస్తామన్నారు. తెలంగాణ పర్యాటక శాఖ ద్వారా నీరాకు తగిన ప్రచారం కల్పిస్తామని కూడా తె లిపారు. తెలంగాణ సాంప్రదాయక డ్రింక్గా నీరాను ప్రమోట్ చేస్తామని మంత్రి తెలపారు. దశల వారీతా రాష్ట్రంలోని అన్నిజిల్లాల్లో నీరా ఉత్పత్తిచేస్తామని మంత్రి స్పష్టంచేశారు. నీరాలో ఔషధ గుణాలు ఉన్నాయని సీఎం కేసీఆర్ చె ప్పారు. నీరా తాగడం వల్ల షుగర్ తగ్గుతుందన్నారు. ఎన్నోసంస్థలు కూడా తమ పరిశోధనలో ఈ విషయాన్ని వెల్లడించాయని అన్నారు. నీరా అమ్మకాలకు సంబంధించిన లైసెన్స్లు కూడా గౌడ, ఈడిగ కులాలకుమాత్రమే ఇస్తామని కూడా మంత్రి స్పష్టంచేశారు. నీరా ఉత్పత్తి ప్రస్తుతం కాంబోడియా ఆఫ్రికా, ఇండోనేషియా, మలేషియా, శ్రీలంక దేశాల్లోనే ఎక్కువగా ఉందన్నారు. అమెరికా ఇటీవల కాలంలో ఆఫ్రికా నుంచి నీరాను దిగుమతి చేసుకుంటోందన్నారు. మన దేశంలో మహారాష్ట్ర, కేరళా, గుజరాత్, రాజస్థాన్ లాంటి రాష్ర్టాల్లో ఇప్పటికీ అమ్ముతున్నారని అన్నారు.
