రాయదుర్గంలో ఎంఫసిస్ లిమిటెడ్ సాఫ్ట్వేర్ కార్యాలయాన్ని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఐటీ ఎగుమతుల్లో బెంగళూరు కంటే ముందు ఉన్నామని తెలిపారు. ఎంఫసిస్ కంపెనీ మరింత ఉన్నత స్థానానికి వెళ్లాలని కోరుకుంటున్నాను. లోకల్ టాలెంట్ను ప్రోత్సహించండి. తెలంగాణ ప్రభుత్వం ఐటీ కంపెనీల ఏర్పాటుకు పెద్దపీట వేస్తుందన్నారు. హైదరాబాద్లో వెయ్యి మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం శుభపరిణామం అని కేటీఆర్ అన్నారు.
