హుజూర్ నగర్ లో గ్రామగ్రామాన గులాబీ జెండా రెపరెపలాగుతోంది. ఉప ఎన్నిక ప్రచారంలో టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి అద్భుత స్పందన లభిస్తోంది. ఊరూరా సైదిరెడ్డికి జనం ఘనస్వాగతాలు పలుకుతున్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ… జై టీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే హుజుర్నగర్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీకీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది. తెలంగాణ వైసీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్రెడ్డిని కలిసి ఉప ఎన్నిక ఇంఛార్జ్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మద్దతు కోరారు. పల్లా అభ్యర్థనపై సానుకూలంగా స్పందించి శ్రీకాంత్ రెడ్డి మద్దతు ప్రకటించారు. అభివృద్ధి నిరోధక కాంగ్రెస్కు నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పాలని శ్రీకాంత్ అన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వైసీపీ కార్యకర్తలు మద్దతు ఇవ్వొద్దు అని పేర్కొన్నారు.
